ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే చేరి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి రహదారులు నడవలేని స్థితికి చేరుతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కొరారు.