WGL: పర్వతగిరి మండలం కొంకపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ఘటనపై ఉపాధ్యాయుడు వెంకట్రామ్ నరసయ్యను సస్పెండ్ చేశారు. ఐదుగురు విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో ఒక విద్యార్థికి రెండు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ ఘటనపై ఎంఈవో బిక్షపతి మెమో జారీ చేసి విచారణ చేపట్టగా,నివేదిక ఆధారంగా సోమవారం డీఈఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.