ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. సోమవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల సాగర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్య సంస్థలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.