E.G: కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం నెలటూరులో రైతు సేవా కేంద్రం వద్ద కోకో రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదగా సబ్సిడీపై పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరిబాబు, AMC ఛైర్మన్ నాదేళ్ల శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.