SDPT: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట 9వ వార్డు ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల పైకప్పుల మీదుగా ఈ తీగలు వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వారు కౌన్సిలర్ వనం రమేశ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.