TPT: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.