ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ నెల 15లోగా నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్పష్టం చేశారు. అంతేకాకుండా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల నుంచి ఆ సొమ్ము రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.