KNR: గంగాధర మండలం గర్శకుర్తిలో ఘనంగా వరల్డ్ సివిల్ రైట్స్డేను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి భారత సైన్యంలో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న వారికి, వారి తల్లిదండ్రులను స్థానిక సరస్వతి హైస్కూల్లో ఓ ట్రస్ట్ వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డా.రఘరామన్, గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు పాల్గొన్నారు.