NLG: నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి జీ.ప.ఉ.పాఠశాల వార్షికోత్సవం ఆదివారం అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా భవన్ (హైదరాబాద్) డైరెక్టర్ బండ రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థుల బహుముఖ ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవిబాబు, డా. చిలుముల బాల్ రెడ్డి సహా టీచర్లు పాల్గొన్నారు.