W.G: తాడేపల్లిగూడెంకు చెందిన అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏలూరులో జరిగిన సంఘ సమావేశంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శివరామకృష్ణ ఆదివారం తెలిపారు. తనపై సంఘ సభ్యులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని ఆయన పేర్కొన్నారు.