NLR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరులోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా, జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు.