KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ తీర్మానంతో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి కరీంపేట, పాపయ్య పల్లె ప్రజలకు ఉపశమనం లభించనుంది. పాలకులు మారిన రోడ్డు విస్తరణ చేస్తానని పలుమార్లు వాగ్దానాలు చేసి ఏళ్లు గడిచినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు వెడల్పు తో ప్రమాదాల నివారణ తగ్గుతుందన్నారు.