TG: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్రమంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్బంగా BJP సర్పంచ్ అమూల్యకు రూ.10 లక్షల గ్రాంట్ అందించారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాల అభివృద్ధికి తక్షణమే రూ.10 లక్షల కేంద్ర నిధులు అందేలా చేస్తానని బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.