W.G: జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుండి 8వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఏలూరు నగరంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. పోలీస్ సంక్షేమ భవనం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేశారు. ర్యాలీని ఉద్దేశించి అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు మాట్లాడుతూ.. సమాన హక్కులు సమాన గౌరవం, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు.