ASR: జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పాడేరు మండలంలోని మోదాపల్లి గ్రామంలో శనివారం పర్యటించారు. గ్రామంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి నివాసాల వద్దకే కలెక్టర్ వెళ్లి నేరుగా పింఛన్లను పంపిణీ చేశారు. పెన్షన్ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.