SDPT: హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, దుకాణ యజమానులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కోరారు. ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్సులు మార్చి 31వ తేదీలోపు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. పన్నులు వసూలు చేయడానికి వచ్చే సిబ్బందికి సహకరించాలని తెలిపారు.