సత్యసాయి: శ్రీ సత్యసాయి మహాప్రస్థానంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సాయి ఆసుపత్రి సంయుక్తంగా రెండు రోజుల శస్త్రచికిత్స వర్క్షాప్ను ప్రారంభించాయి. డా. కేశవమూర్తి నేతృత్వంలో సుమారు 50 అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ సేవలు నిరుపేదలకు మేలు చేకూరుస్తాయని నిర్వాహకులు తెలిపారు.