సత్యసాయి: మంత్రి సవిత ఇవాళ పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం కోడిగినహల్లిలో పెన్షన్ల పంపిణీ, రూ.1.80 కోట్లతో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, విట్టాపల్లి రోడ్డు పనుల పరిశీలన చేయనున్నారు. మధ్యాహ్నం పెనుకొండ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.