KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపాన వెలసిన శ్రీ మానసా దేవి అమ్మవారికి శుక్రవారం కడప పట్టణానికి చెందిన నారాయణ,రవికుమార్ కుటుంబ సభ్యులు రూ. 2 లక్షలు విలువైన తొడుగులు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజు తొడుగులు సమర్పిస్తామని మొక్కుకున్నామన్నారు. అందుకు ఇవాళ అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నారు.