కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మచిలీపట్నం ఆర్డీవోగా సాంబశివరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ బాలాజీని, ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.