TG: పసుపు కొనుగోళ్ల జాప్యంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఈ-నామ్ 2.0లో సాంకేతిక సమస్యలపై ఆరా తీశారు. ఢిల్లీలోని ఈ-నామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయితో ఆయన మాట్లాడారు. పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.