MDK: తూప్రాన్ పట్టణంలోని సయ్యద్ సాదిక్ కు చెందిన కారు మెకానిక్ గ్యారేజ్ నుంచి చోరీలకు పాల్పడిన ఇరువురిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు. దుబ్బాకకు చెందిన తూర్పాటి సంజయ్ (25), పర్వతం రాజయ్య (27) గురువారం తెల్లవారుజామున విలువైన కేబుల్స్ చోరీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు.