టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20ల్లో 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్లో ఒక సిక్సర్ బాదడం ద్వారా ఇషాన్ ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో వేగంగా 300 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ (217 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో నిలిచాడు. అభిషేక్ (163 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉండగా, రాహుల్ (205) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.