MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా, రహదారుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడాలని, అనుమతి లేకుండా వాహనాల నిలుపుదలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.