MBNR: జడ్చర్ల మండలం మల్లె బోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత నివాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.