అన్నమయ్య: పుంగనూరు టౌన్ మంగళం రోడ్డు, కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతైన నీటి సంపులో ఓ పశువు పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆవును రక్షించి యజమానికి అప్పగించారు. రెస్క్యూ కాల్పై సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహకారంతో రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.