MDCL: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్వాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. శ్రీ చైతన్య, నారాయణ, వైభవ్ , లయోలా తదితర కాలేజీల్లో పరీక్షలు నిర్వహించగా, కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో మొదటి రోజు పరిక్ష ప్రశాంతంగా ముగిసింది.