AP: శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైసీపీ నేతలు ఆందోళనలతో ఇప్పటివకే పలుమార్లు సభ వాయిదా పడగా.. చివరికి సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. కాగా హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశంపై చర్చ జరపాల్సిందేనని వైసీపీ నేతలు పట్టుబడుతూ మండలిలోకి శ్రీవారి ఫొటోలతో రాగా.. చెప్పులతో రావడమేంటని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.