ATP: జనగణన-2027లో భాగంగా ఈనెల 16 నుంచి 30 వరకు జిల్లాలో ‘స్వీయ గణన’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15 రోజుల పాటు వివిధ వర్గాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. 16న ప్రజాప్రతినిధుల గణనతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.