AP: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బాధితుల సంఖ్య 54కు చేరింది. ఆసుపత్రి నుంచి ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. టెస్టింగ్ కోసం వాటర్ శాంపిల్స్ పంపించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ప్రజలంతా వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్రజలు భయపడొద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.