ELR: కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులకు శుక్రవారం విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని మండల టీడీపీ నాయకులు పారేపల్లి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.