W.G: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, విప్లవ యోధుడు చండ్ర రాజేశ్వర రావు 32వ వర్ధంతి కార్యక్రమం గురువారం తణుకులో ఘనంగా జరిగింది. సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భీమారావు పాల్గొని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.