కర్నూలు: కలెక్టర్ సిరి ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, ఒక్క అర్జీ కూడా ఎస్ఎల్పీకి మించకూడదని స్పష్టం చేశారు.