SKLM: కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన ఘటన మందస మండలం లోహరిబంద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీనారాయణ(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులకు డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో కోపంతో తండ్రిని కొట్టగా తలకు తీవ్ర గాయాలై మరణించాడు. దీనిపై ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు.