CTR: పుంగనూరు నగిరి వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కొక్క వాహనంపై పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమాలకు సహకరించినవారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.