ELR: అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ నాగ ప్రభు కుమార్ శుక్రవారం జంగారెడ్డిగూడెం, పోలవరం ఎక్సైజ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లలో ఉన్న రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నాటు సారాయికి సంబంధించిన సమాచారం సేకరించాలని అలాగే తెలంగాణ ఇతర రాష్ట్రలా నుంచి సుంకం చెల్లించని మద్యం రవాణాపై నిఘా ఉంచాలన్నారు.