SKLM: కొత్తూరు మండల కేంద్రంలో దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైస్ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాద్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ, నిబద్ధత, రాజకీయ విలువలను స్మరించుకుంటూ, నేటి యువత మాజీ కేంద్రమంత్రి ఆశయ సాధనాలకు కృషి చేయాలన్నారు.