JN: చిల్పూరు ఎంపీడీవో రఘురామకృష్ణను బీజేపీ మండల అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చూడాలని, వీబీ రామ్ జీ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం కల్పించాలని ఉపేందర్ యాదవ్ కోరారు.