KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంటలో అకాల మరణం చెందిన తాళ్లపల్లి మహేష్ గౌడ్ కుటుంబానికి గ్రామస్థులు మానవత్వంతో అండగా నిలిచారు. గురువారం సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో బాధితుని కుటుంబానికి రూ. 45 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి గ్రామ దాతలు ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు.