చిత్తూరు జిల్లాలో ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. 2,05,753 మంది రైతు కుటుంబాలకు రూ.115.81 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.