ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ‘జనగణన-2027’ హౌస్లిస్టింగ్ ప్రక్రియపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సర్వేను డిజిటల్ పద్ధతిలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహశసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొని కీలక సూచనలు అందుకున్నారు.