KRNL:పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశంలో హానుమపురం MPTC శశిరేఖ అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు కనీస తాగునీటి అవసరాలు తీర్చలేనప్పుడు నాయకులుగా ఉండటం వ్యర్థమని ఆమె విమర్శించారు. తాగునీటి కోసం కోట్లు ఖర్చు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరు 1వవార్డులో మురుగునీటిలో ఉన్న పైపును తక్షణమే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.