AP: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖలో క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో మంత్రి లోకేష్ కీలక చర్చలు జరిపారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో భారీ ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.