PLD: భర్త అనారోగ్యంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను (55) పోలీసులు కాపాడారు. నరసరావుపేటకు చెందిన ఆమె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ప్రభాకర్, వెంటనే సిబ్బందిని పంపి ఆమెను సురక్షితంగా రక్షించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సీఐ, పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.