JN: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 12న వేట ఫౌండర్, చైర్మన్ ఝాన్సిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మండలంలోని శ్రీ సోమేశ్వర్ కల్యాణ మండపంలో ఉ.9:00 గం.కు జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాలకుర్తి MLA యశస్విని రెడ్డి హాజరుకానున్నారు. మహిళల సాధికారత, వారి ప్రతిభను ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలు ఉండనున్నాయి.