NLG: చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు బుధవారం తెలిపారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి నీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.