సత్యసాయి: నల్లమాడలో ముస్లిం మైనార్టీలు మంగళవారం రాత్రి నిర్వహించిన ఇప్తార్ విందుకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు చేస్తూ ప్రార్థనల ద్వారా అల్లా ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.