KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఆదోని ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జి సాయి సుబాష్ విచారణ జరిపారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధించగా, ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఎం. రమేష్కు 15 రోజుల జైలు శిక్ష పడిందని, పెద్దకడబూరు ఎస్సై మారుతి తెలిపారు.