ATP: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆదివారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని విశేష పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.