సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 10న జరగనున్న రథోత్సవ ఏర్పాట్లను జిల్లా SP సతీష్ కుమార్ శనివారం పరిశీలించారు. రథం సాగే మార్గాలు, ప్రధాన కూడళ్లలో భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.